ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..ఇక సందడే సందడి

0
41

ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్​ను 75 రోజుల పాటు నిర్వహించేలా బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. ఐసీసీ భవిష్యత్తు పర్యటనల జాబితాలోనూ చేరుస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. కొత్త ఫ్రాంచైజీలను ఏర్పాటు చేయాలనే ఆలోచన లేదని అన్నాడు. ఐపీఎల్‌ కోసం ప్రత్యేకంగా రోజులు కేటాయించడంపై బీసీసీఐకి ఇప్పటికే అనేక దేశాల మద్దతు లభించింది.

ఈ లీగ్‌ను విస్తరించే క్రమంలో ఆట నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. క్షేత్రస్థాయి నుంచి బలంగా ఉండేలా చర్యలు చేపడుతూనే ఉంటాం. అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పిస్తాం” అని జై షా పేర్కొన్నాడు. అదేవిధంగా ఏటా ఐపీఎల్​లో వివిధ దేశాల ఆటగాళ్లు పాల్గొంటున్నా.. ముందుగా ఉన్న షెడ్యూల్స్​ కారణంగా కొంతమంది ఐపీఎల్​ను మిస్​ అవుతున్నారు. దీంతో తమ అభిమాన ప్లేయర్​ జట్టులో లేడని ఫ్యాన్స్​ కూడా కాస్త నిరాశ చెందుతున్నారు.

ఇప్పుడు ఆ లోటును కూడా బీసీసీఐ భర్తీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం ఐపీఎల్​ కోసం అన్ని క్రికెట్​ బోర్డులు ప్రత్యేక షెడ్యూల్​ను కేటాయించేలా తీర్మానించింది. దీనికి ఐసీసీ కూడా ఆమోదం తెలపడంతో లైన్​ క్లియరైంది. ఐసీసీ తయారు చేసే తదుపరి క్యాలెండర్​లో ఐపీఎల్​ కోసం రెండున్నర నెలలు కేటాయించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు.