India Squad | ఇంగ్లాండ్‌తో మూడు టెస్టులకు భారత్‌ జట్టు ప్రకటన

-

ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భాగంగా త్వరలో జరగనున్న మూడు టెస్టులకు భారత జట్టు(India Squad)ను బీసీసీఐ ప్రకటించింది. కింగ్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చినట్లు తెలిపారు. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చారు. కొత్తగా ఆకాశ్‌ దీప్‌ టెస్టుల్లోకి ఎంపికయ్యాడు.

- Advertisement -

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు టెస్టులు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టును ఇంగ్లండ్ గెలవగా.. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టును భారత్ సొంతం చేసుకుంది. దీంతో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఫిబ్రవరి 15న రాజ్ కోట్‌ వేదికగా మూడో టెస్టు జరగనుంది. నాలుగో టెస్టు ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో జరగనుంది. ఐదో మ్యాచ్‌ మార్చి 7న ధర్మశాలలో మొదలుకానుంది.

India Squad :

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్‌ గిల్, కేఎల్ రాహుల్, రజత్‌ పటీదార్, సర్ఫరాజ్‌ ఖాన్, ధ్రువ్‌ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్‌ యాదవ్, సిరాజ్, ముకేశ్‌ కుమార్, ఆకాశ్‌ దీప్‌.

Read Also:  తెలంగాణ బడ్జెట్ వివరాలు ఇవే..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...