ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్.. భారత్ కి మరో ఎదురు దెబ్బ

-

ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్ లోనే భారత్ పరాజయం పాలయ్యింది. ఈ క్రమంలో భారత్ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. తొలి టెస్ట్ లో మెప్పించిన కేఎల్ రాహుల్(KL Rahul), రవీంద్ర జడేజా రెండవ టెస్టులో ఆడటం లేదు. గాయాల కారణంగా వీరిద్దరూ సెకండ్ మ్యాచ్ కి దూరమైన్నట్లు BCCI ప్రకటించింది. వీరికి బదులుగా ముగ్గురు ఆటగాళ్లను స్క్వాడ్ లోకి తీసుకుంది బీసీసీఐ. సర్ఫరాజ్ కుమార్, వాషింగ్టన్ సుందర్, సౌరబ్ కుమార్ లను ఎంపిక చేసింది.

- Advertisement -

ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. “రవీంద్ర జడేజా(Ravindra Jadeja), కేఎల్ రాహుల్(KL Rahul) గాయం వల్ల వైజాగ్ లో జరగనున్న రెండో టెస్టులో ఆడట్లేదు. మొదటి టెస్టులో రన్నింగ్ చేస్తుండగా జడేజా మడమ కండరం పట్టేసింది. కేఎల్ రాహుల్ కి తొడ కండరం నొప్పి బాధిస్తుండటంతో రెస్ట్ కావాలని రిక్వెస్ట్ చేసాడు. ఆ ఇద్దరినీ మా వైద్యబృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. వారి స్థానంలో సెలక్షన్ కమిటీ ముగ్గురు ఆటగాళ్లను సెలెక్ట్ చేసింది. సర్ఫరాజ్ ఖాన్, సౌరబ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ లను జట్టులోకి తీసుకుంది” అని బీసీసీఐ ప్రకటించింది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 2 న రెండో టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవనుంది. వైజాగ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

Read Also: టీడీపీ చీఫ్ చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....