Chandrababu | టీడీపీ చీఫ్ చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం

-

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు తృటిలో ప్రమాదం తప్పింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గలో తాపేరులో ‘రా.. కదలిరా’ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ(TDP), జనసేన(Janasena) శ్రేణులు తరలివచ్చారు. చంద్రబాబు ప్రసంగం పూర్తైన తర్వాత నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చారు. చంద్రబాబును కలిసి బొకేలు ఇచ్చేందుకు పోటీలు పడ్డారు. ఇందులో మహిళా నేతలు కూడా ఉన్నారు.

- Advertisement -

అంతమంది ఒక్కసారిగా స్టేజి పైకి రావడంతో గందరగోళం నెలకొంది. ఇంతలో కొంతమంది చంద్రబాబుపై పడ్డారు. ఈ క్రమంలో ఆయన వేదికపై నుంచి కింద పడబోయారు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది ఆయన కింద పడకుండా చేతులతో పట్టుకున్నారు. లేదంటే చంద్రబాబు కింద పడిపోయారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో అక్కడున్న వారంతా ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తూ బాబు(Chandrababu)కు ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. చంద్రబాబుకు ఊరట..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...

Pushpa 2 | బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఈసారి అసలు తగ్గేదేలే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. 'పుష్ప2(Pushpa...