T20 World cup: టీమిండియా గెలుపు కోసం పాకిస్థాన్‌ ప్రార్థనలు!

-

T20 World Cup: టీ20 వరల్డ్‌ కప్‌- 2022లో టీమిండియా గెలుపు కోసం పాకిస్థానీయులు ప్రార్థనలు చేస్తున్నారు. ఏంటి నిజమా అని ఆశ్చర్యపోకండి. ఫేక్‌ న్యూస్‌ అని కొట్టిపారేయకండి. ఇది నిజమే. వరుస ఓటమిలతో సెమీస్‌లో ఆడే ఛాన్స్‌ను పాక్‌ జట్టు క్లిష్టతరం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పాక్‌ సెమీస్‌ చేరటం భారత్‌ జట్టు చేతుల్లోనే ఉంది. ఇండియా జట్టు గాని దక్షిణాఫ్రికా, జింబాంబ్వే, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై గెలిస్తే.. పాక్‌ ముందుకు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆదివారం జరగనున్న భారత్‌-దక్షిణాఫ్రికా (T20 World Cup)మ్యాచ్‌లో భారత్‌ గెలవాలని పాక్‌ వాళ్లు ప్రార్థనలు చేస్తున్నారు. కాగా, నేడు సాయంత్రం 4.30కు దక్షిణాఫ్రికాతో భారత్‌ ఢీకొట్టనుంది. భారత్‌, జింబాంబ్వేలతో జరిగిన మ్యాచుల్లో పాక్‌ ఘోర ఓటమిని చవి చూసింది. దీంతో పాక్‌ ఇప్పుడు గ్రూప్‌-2లో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఒకవేళ మిగిలిన మూడు మ్యాచుల్లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌పై గెలిచినా.. పాయింట్లు కలిసిరాకపోతే.. సెమీస్‌ నుంచి పాక్‌ తప్పుకోవాల్సిందే.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...