Asia cup 2022: పాక్ కు ఎదురుదెబ్బ..ఇండియాతో మ్యాచ్ కు స్టార్ ప్లేయర్ దూరం

0
39
Confrontation between India and Pakistan

ఆసియా కప్‌ లో భాగంగా ఆగస్టు 28న జరిగే భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది. చాలా ఏళ్ల తర్వాత దాయాది జట్టుల మధ్య జరుగుతోన్న మ్యాచ్‌ కావడంతో క్రికెట్‌ ప్రపంచం దృష్టి ఈ మ్యాచ్‌పై పడింది. దీంతో ఇరు జట్ల ప్లేయర్‌ తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఈ తరుణంలో పాకిస్థాన్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. పాకిస్థాన్‌ కీలక ప్లేయర్‌ పేసర్‌ మహ్మద్‌ వాసీమ్‌ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతను తుది జట్టుకు ఎంపిక కష్టమనే వాదన వినిపిస్తోంది.