Sourav Ganguly | ఆ స్టేడియంలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూడాలనుంది!

-

ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఇండియా వేదికగా ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్ జరుగనున్న సంగతి తెలిసిందే. తాజాగా.. వరల్డ్ కప్‌పై బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వన్డే ప్రపంచకప్ 2023లో సెమీ ఫైనల్ చేరుకునే జట్లపై గంగూలీ తన అంచనాలను వెల్లడించాడు. తన అంచనా ప్రకారం మొత్తం 5 జట్లు సెమీస్ రేసులో ఉన్నట్లు పేర్కొన్నాడు.

- Advertisement -

ముఖ్యంగా భారత్(India), ఆస్ట్రేలియా(Australia), ఇంగ్లండ్(England) జట్లు సెమీ ఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. ఇక ప్రపంచకప్ టోర్నీలలో న్యూజిలాండ్‌ను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయడానికి వీళ్లేదని చెప్పుకొచ్చాడు. ఆ జట్టుకు కూడా సెమీస్ చేరే అవకాశాలున్నాయని అన్నాడు. అలాగే మెరుగ్గా ఆడితే పాకిస్థాన్‌ కూడా సెమీస్ చేరే అవకాశాలున్నాయని చెప్పుకొచ్చాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ తలపడాలని గంగూలీ(Sourav Ganguly) ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, లీగ్ స్టేజ్‌లో భారత్, పాకిస్థాన్(Ind vs Pak) పోరు అక్టోబర్ 15న జరగనుంది.

Read Also: నేడే బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్‌.. నాలుగు నెలల తర్వాత బరిలోకి!

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...