Srikalahasti | శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

-

తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి(Srikalahasti) ఏర్పేడు మార్గంలోని మిట్టకండ్రిగ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు సైతం ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన ఓ కుటుంబం దైవదర్శనార్థం తిరుపతికి చేరుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు.

- Advertisement -

అనంతరం శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకునేందుకు తిరుమల నుంచి బయలుదేరారు. అయితే శ్రీకాళహస్తి(Srikalahasti) ఏర్పేడు మార్గంలోని మిట్టకండ్రిగ వద్ద టీ స్టాల్‌కు వెళ్లాలనుకున్నారు. ఇంతలో వారిని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. రాంగ్ రూట్‌లో కారు ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

Read Also: తిరుమలకు భారీగా పోటెత్తిన భక్తులు

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి...

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

YS Jagan Foreign Tour | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి...