అత్యంత చెత్త దశలో విరాట్ కోహ్లీ..సౌరవ్ గంగూలీ సంచలన కామెంట్స్

0
42

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ. ఈ పేరు వింటేనే రన్ మెషిన్ అని గుర్తొస్తుంది. అలాంటి కోహ్లీ గత కొన్ని నెలలుగా సరిగా రాణించలేకపోతున్నాడు. అలవోకగా సెంచరీలు చేయగలిగే కోహ్లీ రెండంకెల స్కోర్ చేయడానికి నానా పాట్లు పడుతున్నాడు. విరాట్ కోహ్లి ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత చెత్త దశలో ఉన్నాడు. భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లి సెంచరీ చేయక వెయ్యి రోజులు కావస్తోంది. చివరగా 2019లో చివరి సెంచరీ సాధించాడు కోహ్లీ.

ఇక రానున్న ఆసియా కప్ లో కోహ్లీపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. ప్రస్తుతం విరాట్ కోహ్లి ఫామ్ గురించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ ద్వారా కోహ్లి తన పాత ఫామ్‌కు వస్తాడని గంగూలీ భావిస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఆసియా కప్‌లో 60 కంటే ఎక్కువ సగటుతో ఉన్నాడు. ఈ టోర్నమెంట్ చరిత్రలో అత్యుత్తమ స్కోరు (183 పరుగులు) చేసిన బ్యాట్స్‌మెన్ కూడా అతడే అని గుర్తు చేశాడు.

ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ, ‘అతను ప్రాక్టీస్ చేసి మ్యాచ్ ఆడనివ్వండి. అతను పెద్ద ఆటగాడు. చాలా పరుగులు చేశాడు. అతను తిరిగి తన పాత ఫాంకి వస్తాడని నేను ఆశిస్తున్నాను. అతను సెంచరీ చేయలేకపోయాడు. అతను ఆసియా కప్‌లో తన ఫామ్‌ను కనుగొంటాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

మరోవైపు, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తదుపరి అధ్యక్షుడిగా తన అభ్యర్థిత్వంపై వస్తున్న ఊహాగానాలను సౌరవ్ గంగూలీ తోసిపుచ్చాడు. గంగూలీ మాట్లాడుతూ, ‘చూడండి, ఇవన్నీ ఊహాగానాలు. ఇవి సరైనవి కావు. ఇది అంత వేగంగా జరగదు. ఇదంతా బీసీసీఐ, ప్రభుత్వం చేతుల్లో లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.