ఆసియా కప్​కు టీమిండియా ఎంపిక..15 మంది జట్టు సభ్యులు వీరే..!

0
59

ఎట్టకేలకు ఆసియా కప్​కు భారత జట్టు ఫైనల్ అయింది.  ఈ జట్టులో ఎవరు చోటు దక్కించుకున్నారు? సీనియర్లు, జూనియర్లతో జట్టు సమతూకంగా ఉందా? బుల్లెట్ వంటి బంతులతో ప్రత్యర్థికి చుక్కలు చూయించే బుమ్రా జట్టులో ఉన్నాడా? లేదా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆసియా కప్​కు ఆడే జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్​ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. విరాట్​ కోహ్లీ, కేఎల్​ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. గాయం కారణంగా కొన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న రాహుల్​ ఫిట్​నెస్​ నిరూపించుకున్నాడు. మళ్లీ వైస్​ కెప్టెన్​గా ఎంపికయ్యాడు. మొత్తం 15 మందితో టీమ్​ను ఎంపికి చేసింది. ​

భారత జట్టు: రోహిత్​ శర్మ(కెప్టెన్​), కేఎల్​ రాహుల్​ (వైస్​ కెప్టెన్​), విరాట్​ కోహ్లీ, సూర్యకుమార్​ యాదవ్​, దీపక్​ హుడా, రిషభ్​ పంత్​(వికెట్​కీపర్​), హార్దిక్​ పాండ్య, దినేశ్​ కార్తిక్(వికెట్​ కీపర్​)​, రవీంద్ర జడేజా, రవిచంద్రన్​ అశ్విన్​, చాహల్​, బిష్ణోయ్​, భువనేశ్వర్​ కుమార్​, అర్ష్​దీప్​ సింగ్, అవేశ్​ ఖాన్​.

స్టాండ్​-బై ప్లేయర్లు: దీపక్​ చాహర్​, శ్రేయస్​ అయ్యర్​, అక్షర్​ పటేల్

 హర్షల్​ పటేల్​, బుమ్రా గాయాల కారణంగా దూరమయ్యారు.