India vs England | హైదరాబాద్‌లో క్రికెట్ అభిమానులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త

-

రేపటి నుంచి హైదరాబాద్‌లో భారత్, ఇంగ్లాండ్(India vs England) పురుషుల జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇందుకు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదిక కానుంది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత నగరంలో టెస్ట్ మ్యాచ్ జరగనుండటంతో మ్యాచ్ చూసేందుకు అభిమానులు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి 60 ప్రత్యేక బ‌స్సుల‌ను న‌డ‌ప‌నున్నట్లు వెల్లడించింది.

- Advertisement -

India vs England | మ్యాచ్ జ‌రిగే ఐదు రోజుల పాటు ఈ బ‌స్సులు న‌డుస్తాయని ప్రకటించింది. ప్రతి రోజు ఉదయం 8 గంట‌ల‌కు పలు ప్రాంతాల నుంచి బస్సులు ప్రారంభ‌మ‌వుతాయ‌ని ఆర్టీసీ(TSRTC) ఎండీ సజ్జనార్ తెలిపారు. తిరిగి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు స్టేడియం నుంచి ఈ బ‌స్సులు బ‌య‌లుదేర‌నున్నాయని పేర్కొన్నారు. క్రికెట్ అభిమానులు ప్రత్యేక బ‌స్సుల స‌ర్వీస్‌ను వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు అభిమానులు తొలి రోజు ఉచితంగా మ్యా్చ్ చూసేందుకు హెచ్‌సీఏ అనుమతి ఇచ్చింది.

Read Also: సీఎం రేవంత్ ఇంటికి భారీగా ఆర్టీసీ ఉద్యోగులు.. అడ్డుకున్న పోలీసులు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...