విండీస్ పర్యటన..కోహ్లీపై వేటు వేసిన బీసీసీఐ

0
42

టీమిండియా ఆటగాళ్లు బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ఆడుతున్న ఇండియా ఆ తరువాత విండీస్ టీ20 సిరీస్​ పర్యటనకు బయలుదేరనుంది. తాజాగా విండీస్ పర్యటనకు ఆటగాళ్లను ఎంపిక చేసింది బీసీసీఐ.

ఈ పర్యటనలో విరాట్ కోహ్లీపై వేటు తప్పలేదు. తీరిక లేకుండా ఆడుతున్న ప్లేయర్ బుమ్రాకు జట్టులో చోటివ్వలేదు. కోహ్లీ స్థానంలో కేఎల్​ రాహుల్​ ఆడే అవకాశం ఉంది. జట్టులో చోటు దక్కించుకున్న మరో ఆటగాడు కుల్​దీప్​ యాదవ్​ను కూడా ఫిట్​నెస్​ చూసి తుదిజట్టులో చోటుకల్పిస్తామని పేర్కొంది.

విండీస్​ పర్యటనకు టీమ్​ఇండియా జట్టు ఇదే: రోహిత్​ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కేఎల్​ రాహుల్, సూర్యకుమార్​ యాదవ్, దీపక్​ హుడా, శ్రేయస్​ అయ్యర్, దినేశ్​ కార్తిక్​, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్సర్​ పటేల్, బిష్ణోయ్, అశ్విన్​, కుల్​దీప్​ యాదవ్, భువనేశ్వర్​ కుమార్, ఆవేశ్​ ఖాన్, హర్షల్ పటేల్, అర్షదీప్​ సింగ్.