Chandrasekhar Reddy | కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి

-

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌ పార్టీకి భారీ షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి కీలక నేతలు రాజీనామా వరుసగా రాజీనామ చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది ప్రముఖ నేతలు ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ పట్నం సునీతా మహేందర్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి(Chandrasekhar Reddy) కాంగ్రెస్‌లో చేరారు. గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీప్‌దాస్‌ మున్షీ వారికి కండువా కప్పి ఆహ్వానించారు.

- Advertisement -

వీరితో పాటు మరికొంతమంది గులాబీ నేతలు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గట్టి దెబ్బ కొట్టాలని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అందుకు తగ్గట్లు చేరికలను ప్రోత్సహిస్తున్నారు. అంతేకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో గ్రేటర్‌లో కీలక నేతలను పార్టీలోకి చేర్చుకుని రాజధాని ఏరియాలో పాగా వేయాలని భావిస్తు్న్నారు.

Read Also: ‘కుర్చీ మడతపెట్టి’.. జగన్‌కు లోకేష్ వార్నింగ్..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...