Amit Shah | RRR సినిమా టీంతో అమిత్ షా రద్దు

-

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆయన శంషాబాద్‌కు చేరుకుంటారు. ఈ మేరకు మార్పులకు సంబంధించి అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. కర్ణాటక ఎన్నికలు, ఇతర ముఖ్య కార్యక్రమాలు ఉండడంతో ఆలస్యంగా అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. షా షెడ్యూల్ ఆలస్యం కారణంగా తొలుత పేర్కొన్న కార్యక్రమాలు పూర్తిగా రద్దయ్యాయి. తొలుత ట్రిపుల్ ఆర్ టీమ్ తో అమిత్ షా భేటీ అవుతారని చెప్పినా ఆలస్యంగా వస్తుండటంతో రద్దయింది.

- Advertisement -

అంతేకాకుండా నొవాటెల్ లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం సైతం రద్దయినట్లుగా సమాచారం. అంతేకాకుండా చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన నేతలతో భేటీ కూడా ఉండకపోవచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా సభకు మాత్రం అనుకున్న సమయానికి అమిత్ షా హాజరుకానున్నారు. ఆదివారం సాయంత్ర 5 గంటలకు శంషాబాద్ నుంచి నేరుగా చేవెళ్లలో నిర్వహించే విజయ సంకల్ప సభ(Vijaya Sankalpa Sabha) ప్రాంగణానికి షా(Amit Shah) చేరుకుంటారు.

Read Also: ప్రధానిపై ఆత్మాహుతి దాడి చేస్తాం.. బీజేపీ కార్యాలయానికి బెదిరింపు లేఖ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...