Revanth Reddy |మునుగోడు ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు

-

హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌(Etela Rajender)పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌‌తో లాలూచీ తన రక్తంలోనే లేదని అన్నారు. తుదిశ్వాస విడిచే వరకు కేసీఆర్‌తో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌‌కు కేసీఆర్‌ రూ.25 కోట్లు ఇచ్చారంటూ భాజపా నేత ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించడాన్ని రేవంత్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు చార్మినార్‌ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేశారు. ‘ఒక వేళ మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్‌ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా.. నా కుటుంబం మొత్తం సర్వనాశనమైపోతుంది’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

- Advertisement -

మునుగోడు ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు రేవంత్ రెడ్డి. మునుగోడులో బీఆర్‌ఎస్(BRS), బీజేపీ(BJP) వందల కోట్లు ఖర్చు చేశాయని ఆరోపించారు. పాల్వాయి గోవర్థన్ రెడ్డి సేవలను గుర్తించి మునుగోడు ఎన్నికల్లో స్రవంతికి పార్టీ టికెట్ కేటాయించింది. ఎన్నికల సమయంలో 300 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. ఒక్క రూపాయి, చుక్క మందు పంపిణీ చేయకుండా ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని యాదగిరిగుట్టలో ప్రమాణం చేయాలని స్రవంతి(Palvai Sravanthi) సవాల్ విసిరింది. మునుగోడులో నిజాయితీగా పనిచేసి స్రవంతిని అభ్యర్థిగా బరిలో నిలిపి ఒక్క నోటు ఇవ్వకుండా ఓటు అడిగామని తెలిపారు. 25 వేల మంది ఓటర్లు స్రవంతి పక్కన నిలబడ్డారు అని రేవంత్ రెడ్డి(Revanth Reddy) గుర్తుచేశారు.

Read Also: ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన అమృత్‌పాల్ సింగ్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...