Bandi Sanjay :అధికారంలోకి వస్తాం.. భైంసా పేరు మారుస్తాం

-

Bandi Sanjay fires on TRS and MIM: వచ్చేది బీజేపీ ప్రభుత్వమేననీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ జోస్యం చెప్పారు. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భైంసాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన బండి సంజయ్‌.. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు ఇక మూడిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీయే గెలుస్తుందనీ.. బీజేపీలోకి అధికారంలోకి రాగానే.. భైంసా పేరును ‘మహిషా’గా మారుస్తామని బండి సంజయ్‌ ప్రకటించారు. భైంసాను దత్తత తీసుకుంటామనీ.. భైంసా అల్లర్ల బాధితులపై కేసులు ఎత్తేస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

బీజేపీ అధికారంలోకి రాగానే, అర్హులైన వారందరికీ ఉచితంగా విద్యా, వైద్యం అందిస్తామనీ.. ఇళ్లు లేని వారికి ఇళ్లు కట్టిస్తామని బండి సంజయ్‌ ప్రకటించారు. భైంసా రావాలంటే వీసా తీసుకోవాలా.. భైంసా ఏమైనా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ దేశాల్లో ఉందా అని బండి నిలదీశారు. బీజేపీ వాళ్లు భైంసా రావాలంటే అనుమతి తీసుకోవాలి.. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎంఐఎం నాయకులు మాత్రం ఎక్కడైనా తిరగవచ్చా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. ప్రజలను కష్టాలు పెడుతున్న కేసీఆర్‌ ఏం సాధించారని బండి సంజయ్‌ (Bandi Sanjay) ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...