పొంగులేటితో ఈటల భేటీ పై బండి సంజయ్ రియాక్షన్

-

పొంగులేటితో బిజెపి నేతల భేటీ పై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు. పొంగులేటి వద్దకు ఈటల వెళ్లారన్న విషయం తనకు తెలియదని సంజయ్ వెల్లడించారు. తన వద్ద ఫోన్ లేనందునే సమాచారం అందలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. పొంగులేటితో భేటీ విషయం తనకు చెప్పకపోవడం తప్పేమీ కాదని ఆయన సమర్థించారు. పార్టీలో ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్తారు అన్నారు బండి సంజయ్.

- Advertisement -

నాకు తెలిసిన వారితో నేను మాట్లాడతా ఈటలకు తెలిసిన వారితో ఆయన మాట్లాడుతారు, ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదంటూ బండి సంజయ్(Bandi Sanjay) స్పష్టం చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) పార్టీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామన్నారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యంపై పోరాడటానికి ఎవరినైనా కలుపుకుపోతామని ఆయన తేల్చి చెప్పారు. కాగా పొంగులేటితో ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు భేటీ కానున్నారు.

Read Also: ఆసక్తిగా మారిన పొంగులేటి, ఈటెల భేటీ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...