ఆ ఉగ్రవాది పనిచేసింది ఒవైసీ ఆసుపత్రిలోనే: బండి సంజయ్

-

Bandi Sanjay |ఉగ్రవాదం కేసులో పరారీలో ఉన్న మొహమ్మద్ సలీంను బుధవారం మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో హైదరాబాద్ నుంచి అరెస్ట్ అయిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ సిబ్బందితో కలిసి హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, మొహమ్మద్ సలీం మాత్రం తప్పించుకుని పారిపోయాడు. అతని కోసం తీవ్రంగా గాలింపు చేపట్టిన పోలీసులు బుధవారం పట్టుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం భోపాల్ తరలించారు.

- Advertisement -

ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) MIM MP అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi)పై సంచలన ఆరోపణలు చేయడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. బుధవారం బండి సంజయ్‌ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఉగ్రవాద లింకులపై ఆలోచించాలని రాష్ట్ర పోలీసులకు సూచించారు. ఉగ్రవాదులకు ఎమ్ఐఎమ్ పార్టీ పాతబస్తీలో స్థావరం కల్పిస్తోందని, అందుకే ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ ఓవైసీ మాట్లాడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అంతేగాక, ఉగ్రవాదులకు పాతబస్తీ అడ్డాగా మారిందని బండి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పోలీసులకు పట్టుబడ్డ ఉగ్రవాది సలీమ్ ఓవైసీ ఆసుపత్రిలో పనిచేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

Read Also: పోలీసు అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ‘కీ’ విడుదలపై అధికారిక ప్రకటన

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...