రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే మొదటి అసెంబ్లీ సీటు అదే: భట్టి

-

ఎన్నికలే లక్ష్యంగా బీసీలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కీలక హామీ ఇచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీల కోసం ప్రత్యేకంగా సబ్‌‌‌‌‌‌‌‌ప్లాన్‌‌‌‌‌‌‌‌ చట్టం తీసుకొచ్చి, బీసీ బంధు(BC Bandhu) అమలు చేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ విజయం ఖాయమని, రాష్ట్రంలో గెలిచే మొట్టమొదటి సీటు స్టేషన్‌‌‌‌‌‌‌‌ ఘన్‌‌‌‌‌‌‌‌పూరే అన్నారు. రాష్ట్ర సంపదను దోపిడీ చేస్తున్న బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్ల వల్ల తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌ ఇల్లు, గిట్టుబాటు ధర, పరిహారం, మూడు ఎకరాల భూమి అంటూ చెప్పి ఇప్పుడు వాటిని విస్మరించారని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీకే ప్రజలు అండగా ఉండాలని కోరారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి వచ్చాక కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామని భట్టి(Bhatti Vikramarka) హామీ ఇచ్చారు.

- Advertisement -
Read Also: మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ స్వీట్ వార్నింగ్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

Health Benefits of Millet | మన భారత దేశంలోని రైతులు...

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...