ప్రీతి MGM ఆస్పత్రిలోనే చనిపోయింది: బండి సంజయ్

-

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యపై మరోసారి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం మూలంగా అందరూ అసహనంలో ఉన్నారని అన్నారు. కేసీఆర్ కూతురు అయిన కవిత పెట్టుకున్న వాచ్‌కి ఇచ్చే విలువ కూడా రాష్ట్ర ఆడబిడ్డలకు ఇవ్వడం లేదని తెలిపారు. కవిత ధరించిన వాచ్‌ ఖరీదు రూ.20 లక్షలని.. ఇటీవల చనిపోయన డా. ప్రీతికి మాత్రం కేవలం రూ.10 లక్షలే పరిహారం ప్రకటించారని విమర్శించారు. అంటే కవిత వాచ్‌కు ఉన్న విలువ కూడా .. ప్రీతి చావుకు లేదా అని ప్రశ్నించారు. ప్రీతి ఎంజీఎం ఆసుపత్రిలోనే చనిపోయిందని.. కాకపోతే ఆ విషయం అప్పుడే చెబితే విద్యార్థులు తిరగబడతారనే భయంతో ప్రీతి డెడ్ బాడీని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్టు డ్రామా ఆడారని బండి(bandi Sanjay) వ్యాఖ్యానించారు.

- Advertisement -
Read Also: బాలుడిని కరవమని ఆ కుక్కలకు నేను చెప్పానా..? విపక్షాలపై మేయర్ సీరియస్

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...