కేసీఆర్ మౌనంపై BJP MP Arvind సీరియస్

-

MP Arvind | ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సమయంలో సీఎం సైలెంట్‌గా ఉండటమేంటని మండిపడ్డారు. వీధి కుక్కల దాడిలో పసి బాలుడు బలైతే సీఎం స్పందించడకుండా ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. మెడికో ప్రీతి ఘటనపై స్పందిస్తూ.. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ర్యాగింగ్ భూతానికి ప్రీతి అరిగోస పడుతుంటే కేసీఆర్ ఎక్కడ ఉన్నారని నిలదీశారు. అంతేగాక, కంటోన్మెంట్ దళిత ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించకపోవడంపై మండిపడ్డారు.

- Advertisement -

MP Arvind | దళిత ఎమ్మెల్యేలకు అమంతి సంస్కారంలోనూ అవమానం జరుగుతుంటే ముఖ్యమంత్రి ఎక్కడున్నారని ప్రశ్నించారు. త్వరలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని అప్పుడు కేసీఆర్(KCR) కంప్లీట్‌ రిలాక్స్ కావొచ్చని ఎద్దేవా చేశారు. బీజీపీ(BJP) ప్రజల పార్టీ.. ప్రజల కోసమే పని చేసే పార్టీ అని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఆగిపోవని, ఇంతకంటే అద్భుతమైన పథకాలు బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుందని హామీ ఇచ్చారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...