కర్ణాటకలో మా ఓటు శాతం తగ్గలేదు: డీకే అరుణ

-

కర్ణాటక ఫలితాలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2018 ఎన్నికల్లో 36 శాతం ఓట్లు సాధించి 104 సీట్లలో విజయం సాధించిన బీజేపీ(BJP) ఈ ఎన్నికల్లోనూ 36 శాతానికి పైగా ఓట్లు సాధించిందన్నారు. అయితే మెజారిటీ సీట్లు గెలవడంలో మాత్రం తాము వెనుకబడినట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో 18 శాతం ఓట్లు సాధించిన జేడీఎస్.. ఈ ఎన్నికల్లో 12 శాతమే ఓట్లు సాధించిందని ఆమె పేర్కొన్నారు. అనేక స్థానాల్లో జేడీఎస్(JDS) పార్టీ ఓట్లు కాంగ్రెస్ కు రావడం వల్లే ఈ 5 శాతం అదనపు ఓట్ షేర్ కాంగ్రెస్ కు సాధ్యమైందని ఆమె(DK Aruna) ఎద్దేవా చేశారు. కర్ణాటక ఎన్నికల చివరి దశలో ఎంఐఎం, ఎస్డీపీఐ పార్టీలు తమ అభ్యర్థులను విరమించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ముస్లిం మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లేందుకు కృషి చేశాయని, కాబట్టే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం, సీట్ల శాతం పెరిగిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Google Wallet | ఆండ్రాయిడ్ యూజర్లు కోసం గూగుల్ వాలెట్ వచ్చేసింది

టెక్ దిగ్గజం google బుధవారం ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ వాలెట్(Google Wallet)...

Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసా?

వైశాఖ శుద్ధ తదియను "అక్షయ" తృతీయగా(Akshaya Tritiya) వ్యవహరిస్తారు. అక్షయం అంటే...