నల్లగొండలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై దాడి

-

నల్లగొండలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. జిల్లాలోని ఇటుకలపాడు గ్రామానికి వచ్చే రూట్లో రోడ్లు బాగోలేవని ఓ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక బీఆర్ఎస్(BRS) కార్యకర్తలు కోమటిరెడ్డిపై కుర్చీలు, కర్రలు విసిరి దాడికి యత్నించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలు బీఆర్ఎస్‌ కార్యకర్తలపై దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఎంపీ దూరంగా ఉంటున్నారు. సందర్భం దొరికినప్పుడల్లా పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఆయనపై కొంత సొంత పార్టీ నేతలు అసహనంలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనపై అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు దాడి చేయడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. మరి దీనిపై జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...