కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు: MLA

-

ఔటర్ రింగ్ రోడ్ లీజు విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(MLA Sudheer Reddy) స్పందించారు. బీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని సుధీర్ రెడ్డి(MLA Sudheer Reddy) స్పష్టం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనల మేరకే బిడ్డింగ్ జరిగిందని వెల్లడించారు. బిడ్డింగ్‌లో 11 సంస్థలు పాల్గొనగా 4 ప్రముఖ సంస్థలు షార్ట్ లిస్టు అయ్యాయన్నారు. అందులో ఎక్కువ కోట్ చేసిన వారికే లీజు దక్కిందని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి(Kishan Reddy) డిమాండ్ చేసినట్టు ఓఆర్ఆర్ బిడ్డింగ్‌పై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నామని, కిషన్ రెడ్డి కూడా సిద్ధం కావాలని సవాల్ చేశారు. అదానీపై జేపీసీ వేయని వారు సీబీఐకి డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, పూణెలో ఇక్కడ లీజు తీసుకున్న వారే తీసుకున్నారని, బీజేపీ నేతల ఆరోపణల్లో పసలేదన్నారు.

- Advertisement -
Read Also: ఆ ఉగ్రవాది పనిచేసింది ఒవైసీ ఆసుపత్రిలోనే: బండి సంజయ్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...