మహారాష్ట్రలో తెలంగాణ ఎమ్మెల్యేలకు తప్పిన పెను ప్రమాదం

-

Maharashtra | మహారాష్ట్రలో ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలకు పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యేలు జోగు రామన్న(Jogu Ramanna), కోనప్ప(Konappa) ప్రయాణిస్తున్న వాహనానికి ఓ పశువు అడ్డు వచ్చింది. దీంతో దానిని తప్పించబోయి ఎమ్మెల్యేల వాహనం డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు స్వల్పంగా డ్యామేజ్ కాగా.. ఎమ్మెల్యేలు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో వాహనంలో మాజీ ఎంపీ నగేష్ కూడా ఉన్నట్లు సమాచారం. నాగపూర్ వెళ్తుండగా పాండ్రా కొడ బోరీ మధ్య ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యేలను వేరే వాహనంలోకి మార్చి ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also:
1. ఎమ్మెల్యేలు వ్యాపారాలు చేయకూడదా? ఐటీ అధికారుల తీరు హేయం

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...