మునుగోడు ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీఎస్పీ

-

తెలంగాణలో తమ పట్టును సాధించుకునేందుకు ప్రతి రాజకీయపార్టీ ప్రయత్నిస్తుంది. అందుకే మునుగోడు ఉపఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ బరిలోకి తాజాగా బీఎస్పీ కూడా చేరింది. మునుగోడులో బీఎస్పీ తరఫున పోటీ చేసేందుకు తమ పార్టీ అభ్యర్థిగా ఆందోజు శంకరా చారిని ఎంపిక చేసినట్లు స్టేట్‌ బీఎస్పీ చీఫ్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ నాంపల్లిలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ మాట్లాడుతూ, మునుగోడు ఉప ఎన్నికలో అన్ని పార్టీల వారు అగ్రకులమైన రెడ్డి వర్గానికి చెందిన వారికే టికెట్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తమ పార్టీ మాత్రమే బీసీ అభ్యర్థిని పోటీలోకి దింపుతున్నట్లు తెలిపారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా, తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం అందించే విధంగా బీఎస్పీ పనిచేస్తున్నట్లు ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ పునరుద్ఘాటించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...