భవిష్యత్తులో కాంగ్రెస్- బీఆర్ఎస్ కలిసే అవకాశాలున్నాయి: ఈటల

-

కాంగ్రెస్ , బీఆర్ఎస్‌ భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశాలు కనపడుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అధ్యక్షుడిగా బండి సంజయ్(Bandi Sanjay) బాగానే పని చేస్తున్నారని, బీజేపీ తెలంగాణలో గెలవాలంటే మరింత శక్తి కావాలని తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ పదవుల కోసం పనిచేయలేదన్నారు. పార్టీలో తన సేవలు ఎలా ఉపయోగించుకోవాలనేది కేంద్ర పెద్దలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. మొన్నటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందనే వారు.. కర్ణాటకలో గెలవగానే తెలంగాణలోనూ గెలిస్తుందని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అక్కడ గెలిస్తే ఇక్కడ కూడా గెలుస్తుందా?అని ప్రశ్నించారు.

- Advertisement -

ఇక నిషేధ భూములను ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని నిలదీశారు. ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ భూములను కొల్లగొడుతున్నారు అని కేసీఆర్ చెప్పేవారని.. మరి ఇప్పుడు ఎవరూ దోచుకుంటున్నారని అడిగారు. కేవలం కేసీఆర్(KCR) కుటుంబ సభ్యుల భూముల కోసమే జీవో111(GO 111) ఎత్తివేస్తాం అంటున్నారని ఈటల మండిపడ్డారు. ఈ భూముల స్కాంతో వచ్చిన డబ్బుతో రాబోయే రోజుల్లో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఈటల(Eatala Rajender) ఆరోపించారు.

Read Also:
1. చెన్నై అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఫైనల్లో ధోనీపై నిషేధం?
2. అలాంటి వారికే తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....