కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ పూజలు

-

తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) సిద్ధిపేట జిల్లా కోనాయిపల్లి(Konaipally Temple) వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. ప్రతి ఎన్నికలకు ముందు ఈ ఆలయంలో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా ఇదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి రోడ్డు మార్గంలో గుడికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో కేసీఆర్‌కు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం నామినేషన్ పత్రాలను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకన్న సన్నిదిలో నామినేషన్‌ పత్రాలపై కేసీఆర్‌ సంతకాలు చేశారు. ఆయన వెంట మంత్రి హరీశ్ రావుతో పాటు పార్టీ సీనియర్ నేతలు, అధికారులు ఉన్నారు.

- Advertisement -

CM KCR

కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారి సీఎం కేసీఆర్‌కు గెలుపొందుతూ వస్తున్నారు. 1985 నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల సమయంలో ఈ ఆలయంలోనే నామినేషన్‌ పత్రాలకు పూజలు నిర్వహించారు. కాగా ఈ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న విషయం విధితమే. ఈ నెల 9న ఉదయం గజ్వేల్‌లో, మధ్యాహ్నం కామారెడ్డిలో కేసీఆర్(CM KCR) నామినేషన్ వేయనున్నారు.

Read Also: ఈ పాలపొడి ప్యాక్ వేస్తే పిగ్మెంటేషన్ మచ్చలు మటుమాయం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...