CM KCR | వారిపై కేసు ఎత్తివేయండి.. డీజీపీకి కేసీఆర్ సంచలన ఆదేశాలు

-

తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌‌(Prof Haragopal) సహా ఇతరులపై పెట్టిన చట్ట వ్యతిరేక కార్యకలపాలు(ఉపా) కేసును వెంటనే ఎత్తివేయాలని డీజీపీ అంజనీకుమార్‌(DGP Anjani Kumar)ను ఆదేశించారు. హరగోపాల్, లేట్ జస్టిస్ సురేష్, జర్నలిస్ పద్మజా షాలపై ఉపా కేసులు ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేశారు.2022 ఆగస్టులో 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌‌లో హరగోపాల్‌తో పాటు 152 మంది ఉద్యమకారులు, మేధావులపై ఉపా కేసు నమోదైంది. మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్‌ పేరు ఉందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే హరగోపాల్‌‌పై దేశద్రోహం కేసు నమోదు అవడం పట్ల ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. వెంటనే ఈ కేసును ఉపసంహరించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -
Read Also:
1. కాంగ్రెస్‌లోకి పొంగులేటి చేరిక తేదీ ఖరారు!

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...