మీరే నా బలం-బలగం.. బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ సందేశం

-

భారత రాష్ట్ర సమితి(BRS) శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) కీలక సందేశం పంపించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ఏడాది కావడంతో అందరూ జనాల్లో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. విపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విస్తృతంగా పర్యటించాలని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజలకు క్షేత్ర స్థాయిలో తెలియజేశాయని పిలుపునిచ్చారు. పార్టీని బలోపేతం చేసేందుకు మరింత కృషి చేయలంటూ లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

ఈ క్రమంలో కార్యకర్తల కృషితోనే పార్టీకి రెండుసార్లు అధికారం లభించిందని, నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలు తెలుసుకోవాలని కేసీఆర్ తన లేఖలో తెలియజేశారు. ఇంకా టీఆర్ఎస్ పార్టీ బీఆర్‌ఎస్‌‌గా ఏర్పడిన తరువాత బీజేపీ బరితెగించి దాడులు చేస్తోందన్నారు. ఇంకా కార్యకర్తలను ఉద్దేశించి ‘బీఆర్‌ఎస్‌ ప్రయాణంలో మీరే నా బలం.. బలగం. దేశం కోసం జరిగే పోరాటంలో ధర్మమే విజయం సాధిస్తుంద’ని అన్నారు. తెలంగాణతో పాటు దేశం కూడా బాగుపడాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలకు తన ఆత్మీయ సందేశంతో పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్‌((CM KCR)).

Read Also: రేపు మరోసారి ఈడీ ఆఫీసుకు ఎమ్మెల్సీ కవిత

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..?

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. మాజీ మంత్రి సదాలక్ష్మి,...

వైసీపీ అభ్యర్థికి 18నెలల జైలు శిక్ష.. విశాఖ కోర్టు సంచలన తీర్పు..

దళితులకు శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ...