Telangana Elections | ఫలితాల్లో కాంగ్రెస్ బోణీ.. రెండు చోట్ల విజయం..

-

Telangana Elections |తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్వారావుపేట(Ashwaraopeta) నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ(Adinarayana).. 28,358 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక ఇల్లందు(Yellandu)లో బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియ నాయక్‌పై 18 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కొరం కనకయ్య(Koram Kanakaiah) విజయం సాధించారు. ఖమ్మంలో 10 స్థానాలకు గాను 2 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా.. ఒక చోట సీపీఐ ఆధిక్యంలో ఉంది.

- Advertisement -

Telangana Elections | ఇక మరో 63 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు వెనుకంజలో కొనసాగుతున్నారు. పాలకుర్తి నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నిర్మల్ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్, ధర్మపురి నుంచి కొప్పల ఈశ్వర్, వనపర్తి నుంచి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల కంటే వెనుక ఉన్నారు.

Read Also: ఓటమి బాటలో ఆరుగురు మంత్రులు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...