కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్(డీఎస్)

-

మాజీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకులు ధర్మపురి శ్రీనివాస్‌(D Srinivas) కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ గాంధీభవన్‌‌లో జరిగిన ఈ కార్యక్రమానికి… టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీహెచ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు హాజరయ్యారు. డీఎస్‌కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు డీఎస్‌ స్వయంగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే కండువా కప్పుకోవడం చర్చనీయాంశమైంది. వీల్‌చైర్‌లో గాంధీ భవన్‌కు వచ్చిన డీఎస్‌.. ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

- Advertisement -
Read Also: మహారాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ ఓపెన్ చాలెంజ్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు 'నవ సందేహాల'...

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...