సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం యాదాద్రి జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అలయ్-బలయ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల బీఆర్ఎస్(BRS) నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్(KCR) కుటుంబం చేస్తున్న మోసాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించడం ఖాయమని అన్నారు. అతి త్వరలో కేసీఆర్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టే పరిస్థితి వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

లిక్కర్ కుంభకోణంలో కూతురు కవిత, రింగ్ రోడ్డు కుంభకోణంలో కొడుకు కేటీఆర్‌లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు గడుస్తున్నా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని మండిపడ్డారు. ప్రజా ధనాన్ని వృథా చేయడానికే ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదికలు ఎందుకూ పనికిరాకుండా పోయాయని ఈటల(Eatala Rajender) ఆగ్రహం వ్యక్తం చేశారు. పండిన పంటను అమ్ముకోలేని దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని అసహనం వ్యక్తం చేశారు.

Read Also:
1. అమెరికాలో తెలుగు విద్యార్థి సజీవదహనం 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...