KCR కు బిగ్‌ షాక్.. ఎన్నికల ప్రచారంపై నిషేధం..

-

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)కు కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. మే 1వ తేదీ రాత్రి 8 గంటల నుంచి మే 3వ తేది రాత్రి 8 గంటల వరకు ప్రచారం చేయకూడదని నిషేధం విధించింది. గత నెలలో సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ, నేతలపై కేసీఆర్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదుచేశారు. ఆయన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. కేసీఆర్‌ను వివరణ అడిగింది. తెలంగాణ మాండలికాన్ని అధికారులు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారని వివరణ ఇచ్చారు. అయితే కేసీఆర్ వివరణపై సంతృప్తి చెందని ఈసీ.. రెండు రోజుల పాటు ప్రచారంపై నిషేధం విధించింది.

- Advertisement -

మరోవైపు ఈసీ నిర్ణయంపై కేసీఆర్(KCR) స్పందించారు. తన మాట‌ల‌ను అధికారులు స‌రిగ్గా అర్థం చేసుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ నేత‌లు తాను మాట్లాడిన కొన్ని వ్యాఖ్యల‌ను ఎంపిక చేసుకొని ఫిర్యాదు చేశారన్నారు. తాను మాట్లాడిన వ్యాఖ్యల‌కు ఇంగ్లీష్ అనువాదం స‌రికాదని.. కాంగ్రెస్ విధానాలు, హామీల అమ‌ల్లో వైఫ‌ల్యాన్నే ప్రస్తావించాను అని వెల్లడించారు. కాగా పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న సమయంలో కేసీఆర్ రెండు రోజుల పాటు ప్రచారానికి దూరం కావడం బీఆర్ఎస్‌ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది.

Read Also: తెలంగాణ గోబెల్ కేసీఆర్.. రేవంత్ రెడ్డి సెటైర్లు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Hyderabad | లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు.. ఆసుపత్రిలో మృతి

Hyderabad | నాంపల్లిలో రెడ్‌హిల్స్ శాంతినగర్ పార్కు ఎదురుగా ఉన్న మఫర్...

SLBC Tunnel | కూలిన ఎస్‌బీసీ టన్నెల్.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం

SLBC Tunnel | శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ దగ్గర భారీ...