రైతుబంధు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్

-

తెలంగాణలో రైతుబంధు(Rythu Bandhu) నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వెంటనే నిధులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే రైతుబంధు నిధుల విడుదల నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రైతుబంధు, ప్రభుత్వ ఉద్యోగుల డీఏలు, రైతు రుణమాఫీల కోసం నిధులు విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం ఈసీ అధికారులను విజ్ఞప్తిచేసింది. ఈ విజ్ఞప్తిని రాష్ట్ర ఎన్నికల అధికారులు సీఈసీ దృష్టికి తీసుకువెళ్లగా రైతుబంధు(Rythu Bandhu) విడుదలకు మాత్రం అనుమతి ఇచ్చింది.

- Advertisement -

ఈనెల 25,26,27 తేదీలు బ్యాంకులకు సెలవులు కావడంతో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం కష్టమవుతుంది. అలాగే ఈనెల 29,30 తేదీల్లో నిధులు విడుదలకు ఈసీ(Election Commission) అనుమతించలేదు. దీంతో ఈనెల 28(మంగళవారం) ఒక్కరోజే నిధుల విడుదలకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ రోజే లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు ఎన్నికలకు నాలుగు రోజుల ముందు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమచేయడం బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. తాము ఆరోపిస్తున్నట్లుగానే బీజేపీ(BJP)-బీఆర్ఎస్(BRS) ఒక్కటేనన్న వాదనలకు బలం చేకూరిందన్నారు.

Read Also: ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటుకు ప్రధాని మోదీ నిర్ణయం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...