Adilabad | ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

-

ఆదిలాబాద్‌(Adilabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం  జరిగింది. జిల్లాలోని గుడిహత్నూర్‌ మండలం మేకలగండి వద్ద ఓ ఆటోను శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ దవాఖాన(Rims Hospital)కు తరలించారు. శాంతినగర్‌కు చెందిన పదిమంది ఆటోలో ఇచ్చోడ నుంచి ఆదిలాబాద్‌(Adilabad)కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.

Read Also: మహేశ్ బాబు, రాజమౌళి కలిసి పరిచయం చేసిన ‘నాయకుడు’
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...