మొన్న హైదరాబాద్.. నేడు మెదక్.. రెచ్చిపోతున్న కుక్కలు

-

Girl attacked by Stray Dogs| తెలంగాణలో వీధి కుక్కల దాడులు దడ పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలో ఏదో ఒకచోట కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో కుక్కల దాడిలో ఓ బాలుడు చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో ఓ బాలికపై కుక్కలు దాడికి దిగాయి. ఇంటి బయట ఉన్న పాపపై ఒక్కసారిగా కుక్కలు మెరుపు దాడి చేశాయి. బాలిక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై కుక్కలను అదిలించడంతో పారిపోయాయి. అయితే ఈ దాడిలో బాలిక తలకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం పాపను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా బాలికపై కుక్కల దాడి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డవ్వడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. వీధి కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర...

Harish Rao | స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కు హ‌రీశ్‌రావు లేఖ

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు(Gaddam Prasad Kumar) మాజీ...