మొన్న హైదరాబాద్.. నేడు మెదక్.. రెచ్చిపోతున్న కుక్కలు

-

Girl attacked by Stray Dogs| తెలంగాణలో వీధి కుక్కల దాడులు దడ పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలో ఏదో ఒకచోట కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో కుక్కల దాడిలో ఓ బాలుడు చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో ఓ బాలికపై కుక్కలు దాడికి దిగాయి. ఇంటి బయట ఉన్న పాపపై ఒక్కసారిగా కుక్కలు మెరుపు దాడి చేశాయి. బాలిక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై కుక్కలను అదిలించడంతో పారిపోయాయి. అయితే ఈ దాడిలో బాలిక తలకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం పాపను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా బాలికపై కుక్కల దాడి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డవ్వడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. వీధి కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sri Rama Navami | శ్రీరామనవమి రోజు వీటిని నైవేద్యంగా పెడితే కోరికలు నెరవేరుతాయి!!

శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా...

PM Modi | భారత్ శ్రీలంక మధ్య కుదిరిన ఏడు అవగాహన ఒప్పందాలు

ప్రధాని మోదీ(PM Modi) శనివారం శ్రీలంకలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇరు...