తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన గ్రూప్-1 పరీక్ష

-

Group 1 Exam | తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-1 పరీక్ష ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 994 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగుతోంది. ఉదయం 8:30 గంటల నుంచే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి పంపించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఉదయం 10:30 గంటలకు మొదలైన పరీక్ష మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. ఉదయం 10:15 గంటలకే అన్ని పరీక్షా కేంద్రాల గేట్లు మూసేసిన అధికారులు.. ఆ తర్వాత వచ్చిన అభ్యర్థులను లోపలికి అనుమతించలేదు. దీంతో ఆలస్యంగా వచ్చిన వారు చేసేదేంలేక ఆవేదనతో వెనుతిరిగి వెళ్లిపోయారు. కాగా గతంలోనూ ఈ పరీక్ష నిర్వహించినప్పటికీ పేపర్ లీక్ కారణంగా తాజాగా మరోసారి నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులతోపాటు ఇన్విజిలేటర్లు కూడా కేంద్రాల్లోకి ఫోన్ తీసుకువెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.

Read Also:
1. మంత్రి రోజాకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...