Gun Firing |కరీంనగర్ జిల్లా మానుకొండూరులో కాల్పుల కలకలం

-

Gun Firing |తెలంగాణలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కరీనంగర్ జిల్లా మానకొండూరులో బుధవారం అర్థరాత్రి నాలుగు రౌడీషీటర్లు బీభత్సం సృష్టించారు. అరుణ్ యాదవ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన దుండగులు అతనని చితకబాదారు. పారిపోతున్న క్రమంలో తుపాకీతో కాల్చారు. అయితే ఆ బుల్లెట్ తగలకపోవడంతో ఆయన పక్కనే ఉన్న ఓ ఇంట్లో దాక్కున్నాడు. అయినా కానీ ఆ దుండగులు ఆ ఇంట్లోకి ప్రవేశించి వారింట్లోని సామాన్లు ధ్వంసం చేసి వారిని బెదిరించారు.

- Advertisement -

స్థానికులు అడ్డుకోబోగా వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నలుగురు అక్కడి నుంచి పారిపోయారు. ఇద్దరిని పోలీసులు పట్టుకోగా.. మరో ఇద్దరు పారిపోయారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని తప్పించుకున్న ఆ ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. అరుణ్‌ తో ఉన్న పాత కక్షలే కాల్పులకు కారణమని పోలీసులు తెలిపారు. అర్థరాత్రి పూట కాల్పులు(Gun Firing) జరగడంతో మానుకొండూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Read Also: భాగ్యనగరంలో ఈ ప్రాంతాల్లోనే డబుల్ డెక్కర్ బస్సుల ప్రయాణం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...