హైదరాబాద్‌లో విద్యార్థి ప్రాణం తీసిన ఇన్‌స్టా రీల్స్

-

Hyderabad |సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి యువత చేసే చేష్టాలు ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. రిస్క్ ప్రాంతాల్లో రీల్స్ చేస్తూ కొంతమంది ఇప్పటికే మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇటువంటి ఘటనే హైదరాబాద్‌(Hyderabad)లో చోటుచేసుకుంది. నగరంలోని సనత్‌ నగర్‌ రైల్వేట్రాక్‌పై ముగ్గురు విద్యార్ధులు ఇన్‌స్టా రీల్స్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో సర్ఫరాజ్‌(16) అనే విద్యార్థిని రైలు వేగంగా ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన విద్యార్థులు రైలు రాకను గమనించి పక్కకు తప్పుకోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. మృతుడు రహ్మత్‌ నగర్‌ డివిజన్‌ పరిధిలోని ఓ మదర్సాలో విద్యాభ్యాసం చేస్తున్నాడు.

- Advertisement -
Read Also: విజయవాడ డ్రైనేజీలో గల్లంతైన బాలుడి కథ విషాదంతం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

MK Stalin | త్వరగా పిల్లల్ని కనండి.. ఆందోళన వ్యక్తం చేసిన స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే...

Srinivas Goud | SLBC ప్రాజెక్ట్ పై సరైన అవగాహన లేకే ఈ ప్రమాదం – శ్రీనివాస్ గౌడ్

రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో...