Jupally Krishna Rao | కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

-

గతకొంతకాలంగా కాంగ్రెస్‌లో చేరడానికి తీవ్రంగా ప్రయత్నించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) ఎట్టకేలకు పార్టీలో చేశారు. ఇవాళ(ఆగష్టు 3) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. జూపల్లిలో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, తెలంగాణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, మల్లు రవి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. కాగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరహాలో సభ నిర్వహించి కండువా కప్పుకోవాలని జూపల్లి(Jupally Krishna Rao) భావించారు.. కానీ, వాతావరణ పరిస్థితులతో పాటు పార్టీ పెద్దల డేట్స్ కుదరక ఆయన చేరిన వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఢిల్లీ వెళ్లి పార్టీలో చేరారు.

Read Also: కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు.. సీఎం స్పీచ్‌పై ఆసక్తి!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...