TS Assembly | కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు.. సీఎం స్పీచ్‌పై ఆసక్తి!

-

TS Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకంగా తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న అన్ని పథకాలను విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లేలా సభలో చర్చ జరిగేలా నిర్ణయించారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి ఇదే సరైన వేదిక అని ప్రధాన ప్రతిపక్షాలు ఈ సమావేశాలు కీలంకగా మారాయి.

- Advertisement -

దూకుడు మీదున్న కాంగ్రెస్, నెమ్మదైన బీజేపీ కూడా గట్టిగా గళం విప్పాలని ఫిక్స్‌ అవడంతో అసెంబ్లీ సమావేశాలు(TS Assembly) ఈ సారి మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. గురువారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా ఈ సభలో ఇటీవల మృతిచెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు సంతాపం ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు. కేవలం మూడ్రోజుల పాటే సమావేశాలు జరుగనున్నట్లు తెలుస్తోంది.

Read Also: కాషాయం గూటికి జయసుధ.. బీజేపీలో చేరడానికి కారణం ఆయనేనట!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...