Jayasudha | కాషాయం గూటికి జయసుధ.. బీజేపీలో చేరడానికి కారణం ఆయనేనట!

-

సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ(Jayasudha) బీజేపీలో చేరారు. బుధవారం సాయంత్రం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆమె కాషాయతీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి పార్టీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీఎం మోడీ లీడర్ షిప్ వలనే దేశం అభివృద్ధి చెందిందని, అందుకే బీజేపీలో చేరానన్నారు. మతం, కులం పరంగా కాకుండా ప్రజలకు మంచి సర్వీస్ చేయాలని, మార్పు కోసమే బీజేపీలో చేరినట్లు స్పష్టం చేశారు. క్రైస్తవులకు రిప్రజెంట్ చేస్తానని ప్రకటించారు.

- Advertisement -

తాను బీజేపీలో చేరుతున్నానంటే చాలామంది ఆశ్చర్య పోయారన్నారు. దాదాపు ఏడాదిగా బీజేపీ నేతలతో తాను మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. సినీ ఇండస్ట్రీలోని అభిమానులంతా మద్దతు ఇస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఇంతకాలం రాజకీయాల్లో కనిపించకపోవడానికి చాలా కారణాలున్నాయని, టైమ్ వచ్చినప్పుడు చెప్తానన్నారు. తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. జయసుధ(Jayasudha)కు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరుందన్నారు. ఆమె చేరిక బీజేపీకి ఉత్సాహాన్ని ఇస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

Read Also: రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. ఆర్థిక శాఖకు కీలక ఆదేశాలు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...