Kishan Reddy | నడిరోడ్డు మీద నన్ను ఎలా ఆపుతారు: కిషన్ రెడ్డి

-

బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. వర్షాలతో పేదలు అనేక ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వం ఇల్లు పంపిణీ చేయకుండా నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో బీజేపీ పోరాటం ఇంకా ప్రారంభం కాలేదని అన్నారు.

- Advertisement -

రంగారెడ్డి జిల్లా బాట సింగారంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ ఇళ్ల పరిశీలనకు గురువారం బయలు దేరిన బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. దీంతో ఒక సెంట్రల్ మినిస్టర్‌ను అయిన తనను నడిరోడ్డుమీద ఎలా అడ్డుకుంటారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ సర్కార్‌కు కాలం చెల్లిందని విమర్శించారు. తనను ఎయిర్‌పోర్టు నుంచి పోలీసులు వెంబడించారని తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇంతకు రెండింతలు అనుభవిస్తారని ఆయన(Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: మణిపూర్‌ అల్లర్లపై ఫస్ట్ టైం స్పదించిన ప్రధాని
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...