Malla Reddy | మాజీ మంత్రి మల్లారెడ్డి కి బిగ్ షాక్

-

మాజీ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy) కి బిగ్ షాక్ తగిలింది. శామీర్ పేట పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు 420 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది. భూకబ్జా(Land grab) చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై శామీర్ పేట పోలీసులు, మాజీ మంత్రి పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారభించారు. వివరాల్లోకి వెళితే… భిక్షపతి అనే వ్యక్తి మాజీ మంత్రి మల్లారెడ్డి 47 ఎకరాల గిరిజన భూమిని కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

మూడుచింతలపల్లి(MuduChintalapalli) మండలంలోని కేశవరం గ్రామంలోని భూమిని ఆయన అక్రమంగా సొంతం చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గిరిజనుల భూములను ఎన్నికల ముందు రోజే కబ్జా చేశారని, అదేరోజు అర్ధరాత్రి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని తెలిపారు. దీంతో మల్లారెడ్డి పాటు అర్థరాత్రి రిజిస్ట్రేషన్ చేసిన ఎమ్మార్వో పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. గిరిజనుల భూములని మల్లారెడ్డి(Malla Reddy) కబ్జా చేశారనే ఆరోపణలు బయటకి రావడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read Also: పార్లమెంట్ లో కలకలం రేపిన ఆగంతకులు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....