Mallu Ravi | బండి సంజయ్ ఆరోపణలకు విలువ లేదు: మల్లు రవి

-

కాంగ్రెస్‌ అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ పెంచి పోషిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌(Bandi Sanjay) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 30 మంది అభ్యర్థులకు ప్రతినెలా పాకెట్‌ మనీ ఇస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా.. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మల్లు రవి(Mallu Ravi) స్పందించారు. తమ పార్టీలో కోవర్టులు ఎవరూ లేరని బండి సంజయ్‌కి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా కేసీఆర్ ఇచ్చే పాకెన్ మనీ కోసం ఆశపడే వాళ్లు అసలే లేరని మండిపడ్డారు. బండి ఆరోపణలకు విలువలేదని కొట్టిపారేశారు. కేసీఆర్‌ను జైల్లో పెట్టిస్తామన్న బండి సంజయ్ ఎందుకు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారని అడిగారు. బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతల మాటలకు పొంతన లేదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్‌(Dharani Portal)ను రద్దు చేస్తామని పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా(JP Nadda) అంటుంటే.. బండి సంజయ్ మాత్రం రద్దు చేయబోమని అంటున్నారని సెటైర్లు వేశారు. ఉద్దేశపూర్వకంగానే ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని తెలిపారు. ఇద్దరిలో ప్రజలు ఎవరు చెప్పేది నమ్మాలని మల్లు రవి(Mallu Ravi) ప్రశ్నించారు.

- Advertisement -
Read Also:
1. తెలంగాణలో గెలిచేది ఆ పార్టీనే.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
2. ఒడిశాలో ఘోర ప్రమాదం.. పది మంది దుర్మరణం

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...