మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

-

మావోయిస్టు అగ్రనేత, పొలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్(Katakam Sudarshan) అలియాస్ ఆనంద్ అలియాస్ దూలా(69) గుండెపోటుతో మృతిచెందారు. మే 31 మధ్యాహ్నం 12.20 గంటలకు దండకారణ్య అటవీ ప్రాంతంలో హఠాత్తుగా గుండెపోటుతో మరణించినట్టు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో తెలిపారు. సుదర్శన్ దీర్ఘకాలికంగా శ్వాసకోశ వ్యాధి, డయాబెటీస్, బీపీ సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు.

- Advertisement -

విప్లవ సంప్రదాయాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించినట్లు వెల్లడించారు. జూన్ 5 నుంచి ఆగస్టు 3 వరకు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సుదర్శన్(Katakam Sudarshan) సంతాప సభలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని ఓ కార్మిక కుటుంబంలో జన్మించిన మావోయిస్ట్ భావజాలానికి ఆకర్షితులయ్యారు. 1974లో జరిగిన శ్రీకాకుళం పోరాటాల ప్రేరణతో ఆయన ఉద్యమంలోకి ప్రవేశించారు.

Read Also:
1. అర్ధరాత్రి ఎవరెవరితో మాట్లాడారు.. అవినాశ్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...

ఫోన్ ట్యాపింగ్.. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తోంది?

తెలంగాణలో ఫోన్ టాపింగ్(Phone Tapping) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ.. సరికొత్త...