తెలంగాణ ప్రజలకు మంత్రి హరీష్‌ రావు శుభవార్త

-

తెలంగాణ ప్రజలకు మంత్రి హరీష్‌ రావు(Harish Rao) శుభవార్త చెప్పారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 500 బస్తీ దవాఖానలు అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. గురువారం సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ పరిధిలో 350, హైదరాబాద్ బయట పట్టణాల్లో 150 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 363 బస్తీ దవాఖానలు సేవలు అందిస్తున్నాయ‌న్నారు. మ‌రో 57 బస్తీ దవాఖానలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయ‌న్నారు. వాటిని వెంటనే ప్రారంభించాలని అధికారుల‌ను ఆదేశించారు. తుది దశలో ఉన్న మిగతా దవాఖానల పనులు వేగవంతం చేయాలన్నారు. జూన్ నెలాఖరు వరకు 500 బస్తీ దవాఖానలు పూర్తి స్థాయిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

- Advertisement -
Read Also: ఈటల రాజేందర్‌కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు: బండి సంజయ్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...