మరోసారి మంత్రి మల్లారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసారి టార్గెట్ పోలీసులు!

-

మంత్రి మల్లారెడ్డి(Minister Malla Reddy) పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు బొర్ర ఉంటే ప్రమోషన్ ఇవ్వొద్దన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజన్ కుమార్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో జిమ్ ఏర్పాటు చేయాలన్నారు. పోలీసులు తనలా ఫిట్‌గా ఉండాలన్నారు. మంచి ఫిట్ నెస్, స్పోర్ట్స్‌లో రాణిస్తేనే ప్రమోషన్ ఇవ్వాలన్నారు. అయితే మంత్రి మాటలకు హోం మంత్రి మహమూద్ అలీ(Mahmood Ali), డీజీపీ అంజనీ కుమార్(Anjani Kumar) నవ్వుకున్నారు. పోలీసులు స్మార్ట్‌గా ఉండాలన్నారు. పోలీస్ అంటేనే దొంగలు భయపడేలా ఉండాలన్నారు. పోలీసులు ఫిట్‌గా ఉండాలని కొంతమంది వాదిస్తుంటే వయసురీత్యా అనారోగ్యంతో అధిక బరువు సమస్యతో బాధపడుతున్న పోలీసులకు ఇలాంటి వ్యాఖ్యలు మానసికంగా వేధించినట్లు అవుతుందని మరి కొంతమంది వాదిస్తున్నారు. మొత్తంగా మల్లారెడ్డి(Minister Malla Reddy) వ్యాఖ్యలపై పోలీసువర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.

- Advertisement -
Read Also:
1. ఆ కలలు ఎక్కువ వస్తున్నాయా… అయితే కారణం ఇదే..!
2. ఈ ఒక్క డ్రింక్ తో మెరిసే చర్మం, జుట్టు మీ సొంతం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...