Harish Rao | మెట్రో రైలులో ప్రయాణించిన మాజీ మంత్రి హరీశ్‌రావు

-

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) ఎల్బీనగర్‌ నుంచి లక్డీకపూర్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. దీంతో ఆయనను ట్రైన్‌లో చూడగానే ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం తేరుకుని ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. హరీశ్‌ కూడా ప్రయాణికులకు సెల్ఫీలు ఇస్తూ సరదాగా వారితో ముచ్చటించారు.

- Advertisement -

నాగోల్ శిల్పారామం(Shilparamam)లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్ రావు(Harish Rao) రవీంద్రభారతిలోని అమెరికా తెలుగు సంఘం ముగింపు ఉత్సవాల కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. అయితే ట్రాఫిక్ వల్ల అక్కడికి చేరుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో మెట్రోలో ప్రయాణించారని సన్నిహితులు తెలిపారు. కాగా గతంలో ఎన్నికల ప్రచారంలో కేటీఆర్(KTR) కూడా మెట్రోలో ప్రయాణించిన సంగతి తెలిసిందే.

Read Also: మెగా ఫ్యామిలీపై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...